వలస కూలీలను అన్నివిధాలా ఆదుకుంటాం : మంత్రి
ABN , First Publish Date - 2020-04-10T10:56:46+05:30 IST
లాక్డౌన్ కారణంగా పనులు లేక ఉపాధి కోల్పోయిన వలస కూలీలు, దినకూలీ కార్మికులను అన్నివిధాలా ప్రభుత్వం ఆదుకుంటుందని
పెనుకొండ, ఏప్రిల్ 9 : లాక్డౌన్ కారణంగా పనులు లేక ఉపాధి కోల్పోయిన వలస కూలీలు, దినకూలీ కార్మికులను అన్నివిధాలా ప్రభుత్వం ఆదుకుంటుందని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు. గురువా రం స్థానిక బీసీ సంక్షేమశాఖ వసతి గృహంలో ఏర్పాటు చేసిన వలస కూలీల శిబిరాన్ని, సత్యసాయి కళాశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ వార్డులను ఆయన పరిశీలించారు.
భోజన, మౌ ళిక సదుపాయల గురించి కూలీలను అడిగి తె లుసుకున్నారు. ఆ మేరకు సదుపాయాలు క ల్పించాలని అధికారులను ఆదేశించారు. కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతరం కావడంతో ప్రజలంద రూ లాక్డౌన్, భౌతికదూరం తప్పనిసరిగా పా టించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పెనుకొండ సీఐ శ్రీహరి, ఎస్ఐ హారుణ్బాషా, వైసీపీ నాయకులు సుధాకర్రెడ్డి, శ్రీకాంత్రెడ్డి, తయూబ్, కోటి ప్రసాద్ పాల్గొన్నారు.