ఏడాదిగా రెడ్ జోన్లో ఉంటున్నాం
ABN , First Publish Date - 2020-05-31T09:23:15+05:30 IST
ఏడాదిగా రెడ్జోన్లో ఉంటున్నామని, గ్రామాల్లో పోలీసుల కవాతులు, పహారా మధ్య భ యాందోళనలో బతుకుతున్నామని అమరావతి రైతు లు అవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే
- 165వ రోజు కొనసాగిన అమరావతి రైతుల ఆందోళనలు
గుంటూరు, మే 30 (ఆంధ్రజ్యోతి): ఏడాదిగా రెడ్జోన్లో ఉంటున్నామని, గ్రామాల్లో పోలీసుల కవాతులు, పహారా మధ్య భ యాందోళనలో బతుకుతున్నామని అమరావతి రైతు లు అవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు చేస్తోన్న ఆందోళనలు శనివారానికి 165వ రోజుకు చేరాయి. ఉక్కు నగరాభివృద్ధికి దాదాపు 30 వేల ఎకరాలు కావాలంటున్న రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు రాజధాని నిర్మాణం ఎన్ని ఎకరాల్లో జరగాలని ప్రశ్నించారు. రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో తాము భూములను ఉదారంగా ఇస్తే.. పగబట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అమరావతి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించిన మహిళలు హిందూ దేవాలయ భూములు కాపాడుకోవడంతో పాటు అమరావతిని నిలుపుకొంటామంటూ కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వస్వామి ఫొటోలతో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.