బాధిత కుటుంబానికి అండగా ఉంటాం : ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-06-28T05:23:37+05:30 IST

కారు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం మండల పరిధిలోని మైలపల్లె పంచాయతీ రాచపల్లెకు చెందిన పాండురాజు సుబ్బరామరాజు, కుమార్‌రాజు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

బాధిత కుటుంబానికి అండగా ఉంటాం : ఎమ్మెల్యే
బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్న ఎమ్మెల్యే

చిట్వేలి, జూన్‌ 27: కారు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం మండల పరిధిలోని మైలపల్లె పంచాయతీ రాచపల్లెకు చెందిన పాండురాజు సుబ్బరామరాజు, కుమార్‌రాజు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆ కుటుంబంలో తీవ్రంగా గాయపడిన హరికృష్ణ రాజు కుటుంబాన్ని మండల కన్వీనర్‌ చెవ్వు శ్రీనివాసులురెడ్డి, ఎల్‌.వి.మోహన్‌రెడ్డి, పాటూరు శ్రీనివాసులురెడ్డితో కలిసి పరామర్శించారు. బాధిత కుటుంబానికి అవసరమైన సహాయాన్ని చేస్తామన్నారు. కాగా, మార్గోపల్లె సీతారాముల కమిటీ సభ్యులు రాచపల్లెకు చెందిన సుబ్బరామరాజు కుటుంబానికి రూ.20 వేలు, జనార్ధన్‌ కుటుంబానికి 20 వేలు సాయం చేశారు. కార్యక్రమంలో చక్రపాణిరెడ్డి, మలిశెట్టి వెంకటరమణబాబు, నాగిరెడ్డి, జమీర్‌, నవీన్‌ పాల్గొన్నారు. 


రూ.56 వేలు ఆర్థిక సహాయం

మండల పరిధిలోని యం.రాచపల్లె బాధిత కుటుంబానికి క్షత్రియ సేవా సంఘం కువైత్‌ వారి తరపున సోమవారం రూ.56 వేల నగదును  అందించారు. నంద్యాల వద్ద కారు ప్రమాదంలో మృతి చెందిన కుమార్‌ రాజు భార్యకు గ్రామస్థులు అజయ్‌రాజు, గిరిబాబురాజు, సురే్‌షరాజులు సహాయం చేశారు. కార్యక్రమంలో పాండురాజు శంకర్‌రాజు, గంగరాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-28T05:23:37+05:30 IST