ప్రమోషన్లు మాకొద్దు.. ‘గాంధీ’ని వదలం..!

ABN , First Publish Date - 2021-12-18T18:54:15+05:30 IST

గాంధీ ఆస్పత్రిలో చాలా కాలంగా పని చేస్తున్న కొంత మంది వైద్యులను ప్రభుత్వం ఇటీవల బదిలీ చేసింది.

ప్రమోషన్లు మాకొద్దు.. ‘గాంధీ’ని వదలం..!

హైదరాబాద్ సిటీ/అడ్డగుట్ట : గాంధీ ఆస్పత్రిలో చాలా కాలంగా పని చేస్తున్న కొంత మంది వైద్యులను ప్రభుత్వం ఇటీవల బదిలీ చేసింది. కానీ, వారు ఇంకా అక్కడే విధులు కొనసాగిస్తున్నారు. గాంధీ కార్డియో విభాగాధిపతి ప్రొఫెసర్‌ నితిన్‌ కాబ్రా ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా బదిలీ అయ్యారు. ఆయనతో పాటు మరో ఐదుగురు వైద్యులు కూడా ఇంకా రిలీవ్‌ కాలేదు. మెడికల్‌ కాలేజీ ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ ప్రకాశ్‌రావుకు సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రమోషన్‌ రాగా ఆయన కూడా ఇంకా వెళ్లలేదు. ప్రమోషన్లు వచ్చినా ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు కొందరు వైద్యులు ఇష్టపడడంలేదు. తాము నగరాన్ని వీడి పోలేమని, ప్రమోషన్లు అవసరం లేదని కొందరు ప్రభుత్వానికి లేఖ రాసినట్లు విశ్వనీయంగా తెలిసింది. 


Updated Date - 2021-12-18T18:54:15+05:30 IST