మూడు రాజధానులు చేస్తాం: బొత్స
ABN , First Publish Date - 2021-03-28T22:18:35+05:30 IST
మూడు రాజధానులపై టీడీపీ కోర్టుకు వెళ్లి అడ్డుకుంటోందని, ఏ క్షణమైనా పరిపాలన రాజధానిని విశాఖ తరలించే అవకాశం ఉందని
రాజమండ్రి: మూడు రాజధానులపై టీడీపీ కోర్టుకు వెళ్లి అడ్డుకుంటోందని, ఏ క్షణమైనా పరిపాలన రాజధానిని విశాఖ తరలించే అవకాశం ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కోర్టుకు వాస్తవాలు వివరిస్తామని, మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అవకాశాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. మిగిలిన 32 మున్సిపాల్టీలు, 3 కార్పొరేషన్లకు త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. విలీన గ్రామాలతోనే రాజమండ్రి కార్పొరేషన్కు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. మేయర్లు, మున్సిపల్ చైర్మన్లకు మార్చి 31 నుంచి వర్క్షాప్ నిర్వహిస్తామని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.