అవకతవకల్లేవ్‌

ABN , First Publish Date - 2021-04-13T06:56:10+05:30 IST

శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆస్పత్రిలో సీఐడీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

అవకతవకల్లేవ్‌
రికార్డులు పరిశీలిస్తున్న సీఐడీ అధికారులు

శ్రీకాళహస్తి అర్బన్‌, ఏప్రిల్‌ 12: పట్టణ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సీఐడీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన బయోమెడికల్‌ ఎక్వి్‌పమెంట్‌ కొనుగోళ్లపై ఫిర్యాదులందడంతో రాష్ట్రవ్యాప్తంగా సీఐడీ యంత్రాంగం సోదాలు జరిపింది. ఇందులో భాగంగా తిరుపతి సీఐడీ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో అధికారుల బృందం సోమవారం రాత్రి శ్రీకాళహస్తి ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్య పరికరాల కొనుగోళ్లకు సంబంధించిన రికార్డులను తనిఖీ చేశారు. నమోదైన వివరాల మేరకు కొనుగోళ్లు జరిగాయా.. పరికరాలున్నాయా లేవా అన్న అంశాలను పరిశీలించారు. సీఐ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. తనిఖీల్లో ఎలాంటి అవకతవకలు జరిగినట్లు తేలలేదని పేర్కొన్నారు. 

Updated Date - 2021-04-13T06:56:10+05:30 IST