మురుగు కంపు భరించలేకున్నాం

ABN , First Publish Date - 2022-05-21T05:09:29+05:30 IST

ఇళ్ల ఎదుట మురుగు నీరు చేరడంతో భరించలేని దుర్వాసన వస్తున్నదని సంగారెడ్డి మున్సిపల్‌ పరిధిలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో గల రెడ్డికాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు.

మురుగు కంపు భరించలేకున్నాం
ఇళ్ల ఎదుట చేరిన మురుగు నీరు

సంగారెడ్డి రూరల్‌, మే 20: ఇళ్ల ఎదుట మురుగు నీరు చేరడంతో భరించలేని దుర్వాసన వస్తున్నదని సంగారెడ్డి మున్సిపల్‌ పరిధిలోని పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో గల రెడ్డికాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కాలనీకి సమీపంలో మురుగు నీటి కుంట ఉండడం వల్ల చిన్న వర్షానికే కుంటలోని మురుగు నీరంతా, ఇళ్ల ముందుకు చేరి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. గతంలో మున్సిపల్‌ కౌన్సిలర్‌, చైర్‌ పర్సన్‌కు సమస్యను విన్నవించినా పట్టించుకోవడం లేదదన్నారు. మున్సిపల్‌ కమీషనర్‌ వస్తానని ఇప్పటివరకు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఆందోళనలో కాలనీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భాస్కర్‌రెడ్డి, సత్యనారాయణ, మహేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.


Updated Date - 2022-05-21T05:09:29+05:30 IST