AP News: విలేఖరిపై మంత్రి జయరాం అనుచరుల దాడిని ఖండిస్తున్నాం
ABN , First Publish Date - 2022-09-27T02:58:17+05:30 IST
Amaravathi: వైసీపీ నేతల భూకబ్జాలు, దోపిడీలపై కథనాలు రాస్తున్న విలేఖరులపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో జర్నలిస్టుపై మంత్రి జయరాం అనుచరుల దాడిపై ఆయన స్పందించారు. పేకాట, మద్యం అక్రమ రవాణాపై వార్తలు రాసిన విలేఖరిని వాహనంతో అడ్డగించి చంపేందుకు యత్నించడం వైసీపీ అరాచకపాలక
Amaravathi: వైసీపీ నేతల భూకబ్జాలు, దోపిడీలపై కథనాలు రాస్తున్న విలేఖరులపై దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో జర్నలిస్టుపై మంత్రి జయరాం అనుచరుల దాడిపై ఆయన స్పందించారు. పేకాట, మద్యం అక్రమ రవాణాపై వార్తలు రాసిన విలేఖరిని వాహనంతో అడ్డగించి చంపేందుకు యత్నించడం వైసీపీ అరాచకపాలకకు అద్దం పడుతుందన్నారు. వైసీపీ నేతలు దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారని, జర్నలిస్టుపై దాడిచేసిన వైసీపీ నాయకులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.