ఎల్పీజీ... మన డిస్ట్రిబ్యూటర్ను మనమే ఎంపిక చేసుకోవచ్చు
ABN , First Publish Date - 2021-07-27T20:29:02+05:30 IST
ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులకు కేంద్రం ఓ వెసులుబాటును కల్పించింది. ఇకపై వంట గ్యాస్ వినియోగదారులు తమకు నచ్చిన డిస్టిబ్యూటర్ ను ఎంపిక చేసుకోవచ్చని ప్రకటించింది.
న్యూఢిల్లీ : ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులకు కేంద్రం ఓ వెసులుబాటును కల్పించింది. ఇకపై వంట గ్యాస్ వినియోగదారులు తమకు నచ్చిన డిస్టిబ్యూటర్ ను ఎంపిక చేసుకోవచ్చని ప్రకటించింది. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లకు సంబంధించి వినియోగదారులు ఎదుర్కొంటోన్న సమస్యలను పలువురు ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావించిన నేపధ్యంలో... కేంద్ర పెట్రోలియం, సహజ ఇంధన వనరుల శాఖ మంత్రి రామేశ్వర్ స్పందిస్తూ.... ‘ ఇకపై వంట గ్యాస్ వినియోగదారులు తమకు నచ్చిన డిస్టిబ్యూటర్ ను ఎంపిక చేసుకోవచ్చు. వారి వద్ద నుంచే సిలిండర్ ను ఫిల్ చేయించుకోవచ్చు’ అని ప్రకటించారు. మరిన్ని వివరాలిలా ఉన్నాయి.
పైలట్ ప్రాజెక్టుగా...
ఇప్పటివరకు సిలిండర్ వినియోగదారులు ఒక డిస్టిబ్యూటర్ వద్ద మాత్రమే గ్యాస్ ఫిల్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాగా... ఏ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచైనా గ్యాస్ సిలిండర్ తెచ్చుకునే వెసులుబాటును పైలట్ ప్రాజెక్టుగా చండీగడ్, కోయంబత్తూర్, గురుగావ్, పూణే, రాంచీలలో ఇప్పటికే అమలు చేస్తున్నారు. పార్లమెంటులో కేంద్ర పెట్రోలియం, సహజ ఇంధన వనరుల శాఖ మంత్రి రామేశ్వర్ చేసిన ప్రకటనతో ఈ పథకం దేశమంతటా అమలు చేస్తారని తెలుస్తోంది. అయితే ఈ... దీనిని ఎప్పటినుంచి అమలు చేస్తారన్న అంశానికి సంబంధించి మరికొద్ది రోజుల్లో స్పష్టత రానుంది.