మృతదేహాన్ని చూపిస్తేనే నమ్ముతాం

ABN , First Publish Date - 2021-09-17T09:02:07+05:30 IST

నిందితుడు రాజు ఆత్మహత్యపై సందేహాలున్నాయని బాధితురాలి కుటుంబ సభ్యులు అన్నారు. చనిపోయింది రాజేనా? లేక తమను తప్పుదోవ పట్టిస్తున్నారా?

మృతదేహాన్ని చూపిస్తేనే నమ్ముతాం

సైదాబాద్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): నిందితుడు రాజు ఆత్మహత్యపై సందేహాలున్నాయని బాధితురాలి కుటుంబ సభ్యులు అన్నారు. చనిపోయింది రాజేనా? లేక తమను తప్పుదోవ పట్టిస్తున్నారా? అని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో.. సైదాబాద్‌ పోలీసులు బాధిత కుటుంబానికి చెందిన, ఇరుగుపొరుగు వారిని కలుపుకొని ఐదుగురు వ్యక్తులను వరంగల్‌ ఎంజీఎంకు తీసుకెళ్లారు. అక్కడ మృతదేహాన్ని గుర్తించి, రాజుగా నిర్ధారించారు. కాగా.. రాజు మృతదేహాన్ని తమకు అప్పగించాలని బాధితురాలి తండ్రి డిమాండ్‌ చేశారు. ఘటన జరిగిన ప్రాంతంలోనే నిందితుడి మృతదేహాన్ని ఖననం చేస్తామన్నారు. బాధితురాలి నానమ్మ అయితే.. ఏకంగా మృతదేహాన్ని తమకు అప్పగిస్తే తమ చేతులతో నరుకుతామని.. అప్పుడే తమకు శాంతి కలుగుతుందని చెప్పారు.

Updated Date - 2021-09-17T09:02:07+05:30 IST