ఈటలకు అండగా ఉంటాం.. : బీజేపీ నేత

ABN , First Publish Date - 2021-05-04T16:28:29+05:30 IST

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రాజేందర్‌ పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌

ఈటలకు అండగా ఉంటాం.. : బీజేపీ నేత

హైదరాబాద్/తార్నాక : మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు అండగా ఉంటాయని బీజేపీ నాయకుడు లల్లూ ముదిరాజ్‌ అన్నారు. సోమవారం లాలాపేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన రాజేందర్‌ పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేందర్‌పై భూకబ్జా ఆరోపణలు రాగానే వెంటనే స్పందించి కమిటీ వేసి దర్యాప్తు ప్రారంభించిన ముఖ్యమంత్రి.. మంత్రులు, ఎమ్మెల్యేల భూ కబ్జాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా ఉద్యమ నాయకులంతా ఏకమై కేసీఆర్‌ కుటుంబ పాలనకు చరమ గీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు.

Updated Date - 2021-05-04T16:28:29+05:30 IST