ఉద్యమంలో ఉన్నాం... వేతనాల బిల్లులు పెట్టొద్దు

ABN , First Publish Date - 2022-01-29T05:40:20+05:30 IST

రివర్స్‌ పీఆర్సీపై ఉద్యమం చేస్తున్నామనీ, ఈ నేపథ్యంలో జీతాలకు సంబంధించిన బిల్లులు సీఎ్‌ఫఎంఎ్‌సకు పంపొద్దంటూ పీఆర్సీ సాధన సమితి నేతలు.. ఖజానాశాఖ అధికారులను కోరారు.

ఉద్యమంలో ఉన్నాం... వేతనాల బిల్లులు పెట్టొద్దు
ఖజానా శాఖ డీడీకి వినతిపత్రం అందజేస్తున్న జేఏసీల నాయకులు

ఖజానాశాఖ డీడీకి పీఆర్సీ సాధన సమితి నేతల వినతి


అనంతపురం ప్రెస్‌క్లబ్‌, జనవరి 28: రివర్స్‌ పీఆర్సీపై ఉద్యమం చేస్తున్నామనీ, ఈ నేపథ్యంలో జీతాలకు సంబంధించిన బిల్లులు సీఎ్‌ఫఎంఎ్‌సకు పంపొద్దంటూ పీఆర్సీ సాధన సమితి నేతలు.. ఖజానాశాఖ అధికారులను కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు సంబంధించి జనవరి నెల వేతనాలు, పెన్షన్ల బిల్లులు పెడుతున్నారన్న సమాచారం అందుకున్న జేఏసీ నేతలు అతావుల్లా, దివాకర్‌రావు, గోపీకృష్ణ, కులశేఖర్‌రెడ్డి, నరసింహులు శుక్రవారం కలెక్టరేట్‌లోని ఖజానా కార్యాలయానికి వెళ్లా రు. కార్యాలయం ఎదుట గంటపాటు తాజా పీఆర్సీ ఆధారంగా కాకుండా... పాత పద్ధతిలోనే జీతాలివ్వాలని నినాదాలు చేశా రు. అనంతరం ఆ శాఖ డీడీ విజయకుమారితో జనవరి నెలకు సంబంధించిన జీతాల బిల్లులపై చర్చించారు. ఈ సందర్భం గా నేతలు మాట్లాడుతూ... జీతాల బిల్లులను ఆపాలని కోరారు. తాజా పీఆర్సీ ఆధారంగా నివేదికలు పంపితే ప్రతి ఉద్యోగి, ఉపాధ్యాయుడు, పెన్షనర్‌ నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ‘మీరు కూడా ఉద్యోగులే కదా... ఒక్కసారి మా బాధను అర్థం చేసుకోండ’ని డీడీని కోరారు. ఇందుకు ఆమె సీఎ్‌ఫఎంఎస్‌, పైస్థాయి అదికారుల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని చెప్పగా... ఏదేమైనా ప్రభుత్వం నుంచి స్పందన వచ్చేంతవరకూ జీతాలకు సంబంధించి బిల్లులును ఆపాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కలెక్టరేట్‌ ఏఓ విజయలక్ష్మిని కలిసి ప్రభుత్వం దిగొచ్చే వరకూ జీతాల బిల్లులు పక్కనబెట్టి ఉద్యోగిగా ఆలోచించాలని కోరారు. అనంతరం ఖజానాశాఖ డీడీకి వినతిపత్రం అందజేశారు.


Updated Date - 2022-01-29T05:40:20+05:30 IST