మునిసిపాలిటీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

ABN , First Publish Date - 2022-01-23T04:35:41+05:30 IST

మునిసిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అలంపూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ అబ్రహాం అన్నారు.

మునిసిపాలిటీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే అబ్రహాం

అలంపూర్‌ చౌరస్తా, జనవరి 22: మునిసిపాలిటీల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అలంపూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ అబ్రహాం అన్నారు. శనివారం క్యాంపు కార్యాల యంలో అలంపూర్‌, వడ్డేపల్లి, అయిజ మునిసిపాలిటీల చైర్‌పర్సన్లు, చైర్మన్‌, కమిష నర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అయిజ మునిసిపాలిటీకి ఇటీవల టీయూ ఎఫ్‌ఐడీసీ ద్వారా విడుదలైన రూ. 5.50 కోట్ల నిధులతో  చేపట్టాల్సిన డివైడర్‌, సెంటర్‌ లైటింగ్‌ నిర్మాణపు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అదేవిధంగా అలంపూర్‌, వడ్డేపల్లి నూతన మునిసిపాలిటీలకు విడుదలైన రూ. 20 కోట్ల నిధుల వినియోగానికి ప్రణాళిక సిద్ధం చేయాలని  ఆదేశించారు. ప్రతీపైసా ప్రజాఅవసరాలు తీర్చేలా ఉండాలని చెప్పారు. సమావేశంలో కమిషనర్లు నిత్యనందం, నర్సయ్య, చైర్‌పర్సన్లు మనోరమ, చిన్నదేవన్న, ఏఈలు గోపాల్‌, మేఘనాథ్‌గౌడు తదితరులున్నారు.

Updated Date - 2022-01-23T04:35:41+05:30 IST