మైనార్టీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

ABN , First Publish Date - 2022-05-16T05:28:28+05:30 IST

మైనార్టీల అభివృద్ధికి ప్ర భుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ఆల వెంకటే శ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని అన్నా సాగర్‌ గ్రామంలో మైనార్టీ కమ్యూనిటీ నూతన భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

మైనార్టీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
అన్నాసాగర్‌లో మైనార్టీ కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ఆల

- మైనార్టీ కమ్యూనిటీ భవనం ప్రారంభంలో ఎమ్మెల్యే ఆల

భూత్పూర్‌, మే 15 : మైనార్టీల అభివృద్ధికి ప్ర భుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ఆల వెంకటే శ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని అన్నా సాగర్‌ గ్రామంలో మైనార్టీ కమ్యూనిటీ నూతన భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సంద ర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాలు మైనార్టీల గురించి పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ బడుగు, బలహీన వర్గాల వారిని ఆదుకోవాలన్న ఆలోచనతో భారీగా నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, మునిసిప ల్‌ చైర్మన్‌ బస్వరాజుగౌడ్‌, గ్రామ సర్పంచ్‌ నీలిమా, ఉప సర్పంచ్‌ రాజారెడ్డి, ఎంపీటీసీ రజిత, కో- ఆప్షన్‌ సభ్యుడు ఖాజ, మైనార్టీ సంఘం నాయకు లు, ముడా డైరెక్టర్లు చంద్రశేఖర్‌గౌడ్‌, సాయిలు, మాజీ సర్పంచులు నారాయణగౌడ్‌, సత్యనారా యణ పాల్గొన్నారు.


వీవోఏల సమస్యల పరిష్కారానికి కృషి


వీవోఏ, ఆర్పీల సమస్యలు సరిష్కరించడానికి తన కృషి ఎప్పటికీ ఉంటుందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని అన్నాసాగర్‌ గ్రామంలోని ఎమ్మెల్యే ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవరకద్ర నియోజవర్గంలోని వివిధ గ్రామాల్లో పని చేస్తున్న వీవోఏలు, ఆర్పీలు వారి వారి సమస్యలను ఎమ్మెల్యేతో మొరపెట్టుకున్నారు. వీవోఏలకు ప్రభుత్వం బీమా సౌకర్యం, డ్రస్‌కోడ్‌, జీత భత్యాలను పెంచాలని కోరారు. స్పందించిన ఆయన అసెంబ్లీ సమావేశంలో వీవోఏల సమ స్యలను సరిష్కరించడానికి తన వంతు కృషిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన వీవోఏలు, ఆర్పీలు పాల్గొన్నారు.

Updated Date - 2022-05-16T05:28:28+05:30 IST