పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తాం: రాహుల్ గాంధీ

ABN , First Publish Date - 2022-02-12T00:24:16+05:30 IST

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మెజారిటీ సీట్లను గెలుస్తుందని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రస్తుతం ఆయన గోవాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రాజధాని పనాజీలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార..

పూర్తి మెజారిటీతో అధికారంలోకి వస్తాం: రాహుల్ గాంధీ

పనాజీ: గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మెజారిటీ సీట్లను గెలుస్తుందని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రస్తుతం ఆయన గోవాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రాజధాని పనాజీలో శుక్రవారం ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ ‘‘ఈసారి గోవాలో కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయి మెజారిటీతో అధికారంలోకి వస్తుంది. తొందరలోనే మేం గోవాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. దీంతో పాటు ఇంకొన్ని విషయాలు చెప్పడానికి ఇక్కడికి (గోవా) వచ్చాను. గోవాని కోల్ మైనింగ్‌గా చూడాలని ఎవరూ అనుకోవడం లేదు. గోవా అద్భుతమైన పర్యాటక కేంద్రం, అద్భుతమైన సంస్కృతి కలిగినది. అలాంటి గోవానే ముందు వారికి అందిద్దామని చెప్పడానికి వచ్చాను’’ అని రాహుల్ అన్నారు.

Updated Date - 2022-02-12T00:24:16+05:30 IST