మనమంతా వాటాదారులమే: కేంద్ర మంత్రి

ABN , First Publish Date - 2022-05-09T17:25:41+05:30 IST

ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులో ఉంచడంలో అందరూ వాటాదారులేనని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాన్షుఖ్ మాండవీయ అన్నారు. సోమవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ఆన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఆరోగ్య కార్యకర్తలు అంతా కలిసి పని చేసి ప్రజలకు ఆరోగ్య సదుపాయాలు అందించాలని..

మనమంతా వాటాదారులమే: కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ: ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులో ఉంచడంలో అందరూ వాటాదారులేనని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి Mansukh Mandaviya అన్నారు. సోమవారం Delhi లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ఆన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఆరోగ్య కార్యకర్తలు అంతా కలిసి పని చేసి ప్రజలకు ఆరోగ్య సదుపాయాలు అందించాలని ఆయన అన్నారు. గత వారం మూడు రోజుల పాటు అన్ని రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో Chintan కార్యక్రమం జరిగిందని తెలిపిన ఆయన దేశంలో రాబోయే 25 ఏళ్లలో ఆరోగ్య వ్యవస్థకు సంబంధించి Roadmap ను సైతం సిద్ధం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ‘‘ప్రజలకు ఆరోగ్య సదుపాయాలు అందుబాటులో ఉంచే బాధ్యత ఎవరిది? కేంద్ర ప్రభుత్వానిదా, రాష్ట్ర ప్రభుత్వానిదా? నిజానికి ఈ రెండు ప్రభుత్వాలది. వీరితో పాటు ఆరోగ్య కార్యకర్తలది కూడా. ఈ విషయంలో మనమందరం వాటాదారులమే. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు మరింత విస్తృతంగా అందించాల్సిన అవసరం ఉంది. దాని కోసం కలిసి పని చేద్దాం’’ అని కేంద్ర మంత్రి మాన్షుఖ్ అన్నారు.

Read more