అల.. సచివాలయమ్ములో..!

ABN , First Publish Date - 2022-06-25T06:48:44+05:30 IST

గుంతకల్లు పట్టణంలో ఈ నెల 27న వైసీపీ ప్లీనరీ ఉంది. విజయవంతం చేసేందుకు ఆ పార్టీ నాయకులు సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నారు.

అల.. సచివాలయమ్ములో..!
జీ కొట్టాల గ్రామ సచివాలయంలో సమావేశమైన వైసీపీ నాయకులు

గుంతకల్లు పట్టణంలో ఈ నెల 27న వైసీపీ ప్లీనరీ ఉంది. విజయవంతం చేసేందుకు ఆ పార్టీ నాయకులు సన్నాహక సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఇది మామూలే. కానీ పార్టీ సమావేశానికి ప్రభుత్వ కార్యాలయం వేదిక అయింది. జి.కొట్టాల గ్రామ సచివాలయంలో శుక్రవారం అధికార పార్టీ సమావేశాన్ని నిర్వహించుకున్నారు. మాజీ ఎంపీపీ, వైసీపీ మండల కన్వీనర్‌ నారాయణరెడ్డి, వైసీపీ కిసానసెల్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లావనూరు మధుసూదన రెడ్డి తదితరులు సచివాలయంలోనే ప్లీనరీపై చర్చించారు. పలువురు నాయకులతో నారాయణరెడ్డి సెల్‌ఫోనలో మాట్లాడారు. ప్లీనరీకి నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చేలా చూడాలని సూచనలు ఇచ్చారు. అక్కడి హడావుడిని చూసి, సచివాలయానికి జిల్లా అధికారులు వచ్చారేమోనని ప్రజలు భావించారు. అధికార పార్టీ నాయకులు అని తెలియడంతో ముక్కున వేలేసుకున్నారు. ‘సచివాలయ సమావేశం’లో వైసీపీ నాయకులు నాగశేఖర్‌, రమేష్‌ రెడ్డి, హరినాథ రెడి,్డ తదితరులు పాల్గొన్నారు.    - పామిడి

Updated Date - 2022-06-25T06:48:44+05:30 IST