పైడిగాం కాలువల ద్వారా నీరందించండి
ABN , First Publish Date - 2021-06-21T04:34:47+05:30 IST
పైడిగాం కా లువల ద్వారా సోం పేట, కంచిలి మండలాల్లోని ఆయకటు ్టకు ఖరీఫ్లో నీరం దించేందుకు చర్యలు తీసుకోవాలని ని యోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పిరి యా సాయిరాజ్ కోరారు.
సోంపేట రూ రల్: పైడిగాం కా లువల ద్వారా సోం పేట, కంచిలి మండలాల్లోని ఆయకటు ్టకు ఖరీఫ్లో నీరం దించేందుకు చర్యలు తీసుకోవాలని ని యోజకవర్గ వైసీపీ సమన్వయకర్త పిరి యా సాయిరాజ్ కోరారు. ఆదివారం మండలంలోని పైడిగాం కాలువలను పరిశీలించారు. కాలువల్లో పేరుకుపోయిన సిల్ట్ తొలగించాలని, జంగిల్ క్లియరెన్స్ చేయాలని కోరారు. ఈ ప్రాజెక్టు కింద శివారు ఆయకట్టుకు కాలువల ద్వారా సజావుగా నీరందించాలని ప్రాజెక్ట్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో సోంపేట, కంచిలి ఏపీవోలు ప్రమీల, ధనుంజయ, వైసీపీ నాయకులు బి.లోకనాధం, నియోజకవర్గ రైతు చైర్మన్ డాక్టర్ నిమ్మనదాసు పాల్గొన్నారు.