రేపు నగరంలో నీటి సరఫరాకు అంతరాయం
ABN , First Publish Date - 2020-08-04T09:51:02+05:30 IST
నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం నీటి సరఫరాలో అంతరాయం తలెత్తనుంది. హైదరాబాద్ మహా నగరానికి తాగునీటి సరఫరా
హైదరాబాద్ సిటీ, ఆగస్టు3 (ఆంధ్రజ్యోతి): నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం నీటి సరఫరాలో అంతరాయం తలెత్తనుంది. హైదరాబాద్ మహా నగరానికి తాగునీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేస్-3 పైపులైన్కు జంక్షన్ పనులు చేపడుతున్నారు. బుధవారం ఉదయం ఆరు గంటల నుంచి గురువారం ఉదయం ఆరు గంటల వరకు 24 గంటల పాటు పైపులైన్ మరమ్మతు పనులు కొనసాగనున్నాయి. దీంతో నగరంలోని షేక్పేట, టోలీచౌకి, ప్రశాసన్నగర్, జూబ్లీహిల్స్, తట్టిఖాన, మాదాపూర్, గచ్చిబౌలి, గోల్డెన్హైట్స్, హైదర్గూడ, అత్తాపూర్ రిజర్వాయర్ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది.