నిండిపోయాయి.. నీరు వదలొద్దు

ABN , First Publish Date - 2022-06-29T15:44:00+05:30 IST

మరిన్ని జలాలు నిల్వ చేసేందుకు అవకాశం లేనందున జూలై 1వ తేదీ నుంచి కండలేరు రిజర్వాయర్‌ నుంచి కృష్ణా జలాలను నిలిపివేయాలని రాష్ట్ర

నిండిపోయాయి.. నీరు వదలొద్దు

- నిల్వ చేసేందుకు అవకాశం లేదు 

- 1 నుంచి కృష్ణా జలాలు ఆపండి ప్లీజ్‌ 

-  ఏపీకి రాష్ట్ర అధికారుల వినతి


చెన్నై, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): మరిన్ని జలాలు నిల్వ చేసేందుకు అవకాశం లేనందున జూలై 1వ తేదీ నుంచి కండలేరు రిజర్వాయర్‌ నుంచి కృష్ణా జలాలను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖాధికారులు సోమవారం లేఖ రాశారు. నగర ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రతి ఏటా ఏపీ ప్రభుత్వం కండలేరు రిజర్వాయర్‌ నుంచి కృష్ణా జలాలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా మే 8వ తేదీ నుంచి 2.4 టీఎంసీలను విడుదల చేసింది. తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట వద్ద రికార్డు స్థాయిలో 610 క్యూసెక్కుల నీరు నమోదైంది. దీంతో రాష్ట్ర అధికారులు ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. చెంబరంబాక్కం, రెడ్‌హిల్స్‌ రిజర్వాయర్లు ఇప్పటికే గణనీయంగా నిండాయని, అందువల్ల ఇకపై వచ్చే నీటిని నిల్వచేసే సామర్థ్యం లేనందున జూలై 1 నుంచి నీటిని విడుదల చేయవద్దని కోరారు.

Updated Date - 2022-06-29T15:44:00+05:30 IST