ఇక..వంతులవారీ

ABN , First Publish Date - 2022-01-21T05:14:33+05:30 IST

గడచిన కొన్ని సంవత్సరాలుగా జిల్లాలోని డెల్టా రైతులు సాగునీటి సమస్యతో ఇబ్బందులు ఎదు ర్కోవాల్సి వస్తోంది.

ఇక..వంతులవారీ

 రబీలో సాగు నీటి సమస్య పరిష్కారానికి చర్యలు
 నెలాఖరు నాటికి పరిస్థితులను బట్టి అమలు
 80 శాతం మాత్రమే పూర్తయిన వరినాట్లు



ఏలూరు సిటీ, జనవరి 20: గడచిన కొన్ని సంవత్సరాలుగా జిల్లాలోని డెల్టా రైతులు సాగునీటి సమస్యతో ఇబ్బందులు ఎదు ర్కోవాల్సి వస్తోంది. రబీ సాగులో వంతులవారీతో నెట్టుకు వస్తున్నారు. ఇది కూడా  సక్రమంగా అమలు చేయకపోవటంతో శివారు ప్రాంతాలకు నీరందక రైతులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులున్నాయి. సాగునీటి సమస్య పరిష్క రించే ందుకు జిల్లా యంత్రాంగం చర్యలు కూడా చేపట్టింది.సాగునీటి విడుదల పరిస్థితులను అంచనా వేసుకుని నెలాఖరులోగా వంతులవారీ విధానాన్ని అమలు చేసేందుకు ఇరిగేషన్‌ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.జిల్లాలో 4.60 లక్షల ఎకరాల్లో రైతులు దాళ్వా సాగు చేశారు. ఇప్పటివరకు 80 శాతం పైగా వరి నాట్లు పూర్తయ్యాయి. ప్రస్తుత రబీలో తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలోని 8.96 లక్షల ఎకరాలకు 83 టీఎంసీల నీరు అవసరం అవుతుందని ఇరిగేషన్‌ శాఖాధికారులు అంచనా వేశారు. అయితే గోదావరి, సీలేరు నుంచి లభ్యమయ్యే మొత్తం నీరు 61.76 టీఎంసీలు మాత్రమే. దీంతో వంతులవారీ విధానంలో సాగునీరు అందించాలని గత నవంబరు 29న జరిగిన సాగునీటి సలహా మండలి సమావేశం నిర్ణయించింది.


Updated Date - 2022-01-21T05:14:33+05:30 IST