బోరు వేయించినా పైపులైన్కు కొర్రీలు!
ABN , First Publish Date - 2022-06-18T05:12:40+05:30 IST
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు గుడ్లూరు ఎస్సీ కాలనీ లో బోరు వేయించినా పైపులైన్
గుడ్లూరు, జూన్ 17 : అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్లు గుడ్లూరు ఎస్సీ కాలనీ లో బోరు వేయించినా పైపులైన్ బిగించకపోవడంతో కాలనీవాసులు దాహంతో అల్లాడుతు న్నారు. ఎనిమిది నెలల క్రితం స్ధానిక ఎస్సీ కాలనీలోని మెయిన్ సెంటర్లో నీటి ఎద్దడి తీర్చేందుకు ఓ నాయకుడి సహకారంతో సుమారు రూ.1.50 లక్షల ఖర్చుతో బోరు వేయించారు. ఈ బోరు నుంచి పైపులైన్లు నిర్మిస్తే కాలనీలోని సుమారు 500 కుటుంబాల వారికి నీరు సరఫరా అయ్యేది. కానీ కొందరు ఈ బోరు నుంచి పైపులైన్ బిగించడానికి వీలులేదని నిలిపివేయించారు. దీంతో రోజువారీ నీటి కోసం సుదూర ప్రాంతాల నుంచి మోసుకోవాల్సిన పరిస్థితి ఉందని కాలనీవాసులు వాపోయారు. మండల స్ధాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి సదరు బోరుకు పైపులైన్ బిగించి ఎస్సీ కాలనీలో నీటి ఎద్దడిని పరిష్కరిం చాలని సీపీఎం మండల కన్వీనర్ గంటెనపల్లి వెంకటేశ్వర్లు, ఆ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.