మంచినీరు అందక ఎస్సీకాలనీ వాసుల ఇక్కట్లు

ABN , First Publish Date - 2021-03-08T05:27:38+05:30 IST

దర్శి ప్రాంత వాసులకు ఎన్‌ఏపీ రక్షిత మంచినీటి పథకం అమల్లో ఉన్నప్పటికీ అనేక ప్రాంతాలకు సక్రమంగా మంచినీరు చేరడం లేదు.

మంచినీరు అందక ఎస్సీకాలనీ వాసుల ఇక్కట్లు
మంచినీటి కోసం బిందెలతో నిల్చున్న మహిళలు

దర్శి, మార్చి 7 : దర్శి ప్రాంత వాసులకు ఎన్‌ఏపీ రక్షిత మంచినీటి పథకం అమల్లో ఉన్నప్పటికీ అనేక ప్రాంతాలకు సక్రమంగా మంచినీరు చేరడం లేదు. పట్టణంలోని పలు ప్రాంతాలకు ఎన్‌ఏపీ కొళాయిలు కూడా వేయలేదు. ఎస్సీ కాలనీలో నూతనంగా ఇల్లు కట్టుకున్న ప్రాంతాలకు ఎన్‌ఏపీ ట్యాపులు వేయకపోవడంతో దూరప్రాంతాలకు వెళ్లి మంచినీరు తెచ్చుకోవాల్సి వస్తోంది. దీంతో మహిళలు గంటల తరబడి కొళాయిల వద్ద వేచి ఉంటున్నారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డగోలుగా కొళాయి వేసుకుంటున్నా అధికారులు పట్టించుకోలేదు. పేద ప్రజలు కొళాయిలు వేయాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోవటంతో మంచినీటి కష్టాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా అవసరమైన చోట కొళాయిలు ఏర్పాటు చేయాలని ఎస్సీ కాలనీవాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

Updated Date - 2021-03-08T05:27:38+05:30 IST