సాగర్ నుంచి కృష్ణమ్మ పరుగులు
ABN , First Publish Date - 2022-08-11T05:51:11+05:30 IST
ప్రకాశం బ్యారేజీకి కృష్ణమ్మ పరుగులు మరింత ఎక్కువయ్యాయి.
నేడు సాగర్ గేట్లు ఎత్తివేత
3 లక్షల క్యూసెక్కుల ఇన్ఫ్లో
విజయవాడ, జూలై 31 (ఆంధ్రజ్యోతి) : ప్రకాశం బ్యారేజీకి కృష్ణమ్మ పరుగులు మరింత ఎక్కువయ్యాయి. నాగార్జున సాగర్ నుంచి భారీగా నీటిని విడుదల చేయబోతున్నారు. గురువారం ఉదయం సాగర్ ప్రాజెక్టు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తారు. సుమారుగా 3 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తారని అంచనా. ఈ నీరు గురువారం సాయంత్రానికి ప్రకాశం బ్యారేజీకి చేరుతుంది. పెద్ద మొత్తంలో నీరు విడుదల చేస్తే ప్రకాశం బ్యారేజీ 70 గేట్లను రెండు నుంచి, మూడు అడుగుల మేరకు ఎత్తే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది నాగార్జునసాగర్ నుంచి నీరు విడుదల చేయడం ఇదే ప్రథమం. ఇప్పటికే రిటైనింగ్వాల్ నిర్మాణం చాలా వరకు పూర్తయినందున కాలనీల్లోకి నీరు రాకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు.