తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలోకి నీరు

ABN , First Publish Date - 2022-08-20T05:11:09+05:30 IST

చిన్నకోడూరు తహసీల్దార్‌ కార్యాలయ ప్రహరీ పక్కన ఉన్న మిషన్‌ భగీరథ పైపులైన్‌ శుక్రవారం పగిలింది.

తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలోకి నీరు
తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణలో నిలిచిన నీరు

  చిన్నకోడూరులో పగిలిన మిషన్‌ భగీరథ పైపులైన్‌


చిన్నకోడూరు, ఆగస్టు 19: చిన్నకోడూరు తహసీల్దార్‌ కార్యాలయ ప్రహరీ పక్కన ఉన్న మిషన్‌ భగీరథ పైపులైన్‌ శుక్రవారం పగిలింది. సుమారు గంట పాటు నీరు వృథాగా పోవడంతో తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణ మొత్త కుంటను తలపించింది. తహసీల్దార్‌, ఎంపీడీవో, ఎంఈవో, మండల మహిళా సమైక్య కార్యాలయాలు ఒకే ప్రహరీ ఆవరణలో ఉండడంతో ఆయా కార్యాలయాలకు పనుల నిమిత్తం వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న ఆర్‌డబ్ల్యూఎస్‌ సిబ్బంది అక్కడకు చేరుకొని పైపులైన్‌కు మరమ్మతు  చేశారు.


 

Updated Date - 2022-08-20T05:11:09+05:30 IST