సాగు నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు
ABN , First Publish Date - 2022-01-21T05:10:36+05:30 IST
దాళ్వా సీజన్లో సాగు నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడున్నట్లు కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు.
పెంటపాడు, జనవరి 20: దాళ్వా సీజన్లో సాగు నీటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడున్నట్లు కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. మండలంలోని చిలకంపాడు లాకులు, పరిమెళ్ళ లాకులను గురువారం ఆయన పరిశీలించారు. కాలువలో నీటి మట్టం వివరాలను సంబందిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. దాళ్వా సీజన్లో సాగునీటి ఇబ్బందులు లేకుండా అన్ని కాలువలు, లాకులు పరిశీలిస్తున్నామన్నారు. లాకుల ద్వారా నీటికి సక్రమంగా అందించాలని అధికారులకు సూచించారు. సాగు నీరందడం లేదని రైతుల నుంచి ఫిర్యాదులు వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో జేసీ అంబేడ్కర్, ఇరిగేషన్ ఎస్ఈ ఎస్.రామకృష్ణ, ఈఈ దక్షిణామూర్తి, డీఈ ఏ.వెంకటేశ్వరరావు, వ్యవసాయశాఖ జేడీ ఎం.జగ్గారావు, ఏడీఏ మురళీకృష్ణ, తహసీల్దార్ శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.