ప్రకాశం బ్యారేజ్‌కి వరద ఉధృతి.. ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక

ABN , First Publish Date - 2020-09-28T02:14:22+05:30 IST

ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి గంట గంటకు పెరుగుతోంది. దీంతో కృష్ణా నదికి వరద నీరు భారీగా..

ప్రకాశం బ్యారేజ్‌కి వరద ఉధృతి.. ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక

విజయవాడ: ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి గంట గంటకు పెరుగుతోంది. దీంతో కృష్ణా నదికి వరద నీరు భారీగా చేరుతోంది. మునేరు, వైరా, కటలేరు నుంచి 50 వేల క్యుసెక్కుల నీరు విడుదల చేశారు.  ప్రకాశం బ్యారేజీకి ఇన్‌ ఫ్లో 37,489 క్యూసెక్కులు కాగా, ఔట్ ఫ్లో 5,32,399 క్యూసెక్కులుగా ఉంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద  ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. విజయవాడ, మచిలీపట్నం, అవనిగడ్డలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. మరో నాలుగు రోజులు ఇదే ప్రవాహం కొనసాగుతుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. 

Updated Date - 2020-09-28T02:14:22+05:30 IST