బీజేపీ, వైసీపీని తరిమికొట్టాలి

ABN , First Publish Date - 2021-04-13T07:05:28+05:30 IST

ప్రత్యేక హోదా అంశాన్ని బీజేపీ విస్మరించి ఏపీకి తీరనిద్రోహం చేసిందని పనబాక లక్ష్మి విమర్శించారు.

బీజేపీ, వైసీపీని తరిమికొట్టాలి
సీతారాంపేట రోడ్‌షోలో మాట్లాడుతున్న పనబాక లక్ష్మి

ఏర్పేడు, ఏప్రిల్‌ 12: ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ అధికారంలోకి వచ్చాక హమీ విస్మరించి రాష్ట్రానికి తీరనిద్రోహం చేసిందని తిరుపతి పార్లమెంట్‌ టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి విమర్శించారు. సోమవారం ఆమె ఏర్పేడు మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన రోడ్‌షోలో అడుగడుగునా పార్టీ అభ్యర్థికి తెలుగు తమ్ముళ్లు నీరాజనాలు పట్టారు. బీజేపీకి మద్దతుగా వైసీపీ ప్రభుత్వం ప్రత్యేకహోదా ఊసెత్తడం లేదని పనబాక ఆరోపించారు. టీడీపీ హయాంలో ధరల బాదుడు లేకుండా సామాన్యులు సంతోషంగా ఉన్నారని గుర్తుచేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి రాష్ట్రంలో లేదన్నారు. పెట్రోలు, డీజిల్‌, నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటున్నాయని గుర్తుచేశారు. సమస్యలు తీర్చలేని బీజేపీ, వైసీపీ ప్రభుత్వాలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, పార్టీ నేతలు అనితారెడ్డి, ధనంజయులు నాయుడు, బాలాజీనాయుడు, పొన్నారావు, కృష్ణవేణి, మునెయ్య, రాఘవేంద్ర, నాగరాజు నాయుడు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-04-13T07:05:28+05:30 IST