సుందర్ అర్ధ సెంచరీ.. పెరుగుతున్న టీమిండియా ఆధిక్యం
ABN , First Publish Date - 2021-03-05T22:20:31+05:30 IST
ఇంగ్లండ్తో జరుగుతున్న చివరి టెస్టుపై భారత జట్టు పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం దిశగా
అహ్మదాబాద్: ఇంగ్లండ్తో జరుగుతున్న చివరి టెస్టుపై భారత జట్టు పట్టు బిగిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. శుభ్మన్ గిల్ (0), కోహ్లీ (0) వంటి వారు నిరాశ పరిచిన వేళ వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషభ్ పంత్ (101) సెంచరీ చేసి సత్తా చాటాడు. మరోవైపు, బ్యాటింగ్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డుపై పరుగులు పెంచుకుంటూ పోతున్నాడు. ఈ క్రమంలో 96 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెస్టుల్లో సుందర్కు ఇది మూడో అర్ధ సెంచరీ. అక్షర్ పటేల్ అతడికి అండగా ఉన్నాడు. ప్రస్తుతం 90 ఓవర్లు పూర్తయ్యాయి. సుందర్ 57, అక్షర్ పటేల్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ కంటే భారత జట్టు 85 పరుగుల ఆధిక్యంలో ఉంది.