అమెరికా రాజధానిలో కాల్పుల కలకలం

ABN , First Publish Date - 2020-08-10T06:03:33+05:30 IST

అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం రేగింది. దేశ రాజధాని వాషింగ్టన్ డీసీలో

అమెరికా రాజధానిలో కాల్పుల కలకలం

వాషింగ్టన్: అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం రేగింది. దేశ రాజధాని వాషింగ్టన్ డీసీలో శనివారం అర్థరాత్రి కొందరి మధ్య వివాదం ఘర్షణగా మారడంతో ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. ఈ కాల్పుల్లో 17 ఏళ్ల యువకుడు మరణించగా.. 20 మందికి పైగా తీవ్ర గాయాలపాలయ్యారు. గాయాలైన వారిలో ఓ మహిళా పోలీసు అధికారి కూడా ఉన్నట్టు మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. ప్రస్తుతం ఆమె ప్రాణాలతో పోరాడుతోందని పోలీసులు చెప్పారు. రెండు వర్గాల మధ్య వివాదమే ఈ కాల్పులకు కారణమని.. అయితే ఘర్షణ ఎందుకు జరిగిందన్నది తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటివరకు ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదని పేర్కొన్నారు. కాగా.. తన పుట్టినరోజున సరదాగా గడుపుదామని తాను బయటకు వచ్చానని.. ఇదే సమయంలో ఇలాంటి దారుణమైన ఘటన చోటుచేసుకుందని ఓ వ్యక్తి చెప్పుకొచ్చాడు. కాల్పులు మొదలైన వెంటనే అక్కడున్న వారంతా భయంతో కార్ల కిందకు దూరారని తెలిపాడు.

Updated Date - 2020-08-10T06:03:33+05:30 IST