ఆక్రమిత భూముల్లో హెచ్చరిక బోర్డులు

ABN , First Publish Date - 2022-06-28T06:23:38+05:30 IST

పట్టణంలోని దోనిముక్కల రోడ్డు, కసాపురం గ్రామంలో ఆక్రమణల్లో ఉన్న ప్రభుత్వ భూముల్లో సోమవారం రాత్రి తహసీల్దారు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.

ఆక్రమిత భూముల్లో హెచ్చరిక బోర్డులు

గుంతకల్లు, జూన్‌ 27: పట్టణంలోని దోనిముక్కల రోడ్డు, కసాపురం గ్రామంలో ఆక్రమణల్లో ఉన్న ప్రభుత్వ భూముల్లో సోమవారం రాత్రి తహసీల్దారు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. అధికారపార్టీకి చెందిన కొందరు వ్యక్తులు కసాపురంలో దాదాపు ఆరున్నర ఎకరాలు, దోనిముక్కల రో డ్డులో 5 ఎకరాల భూమిని ఆక్రమించి అనధికారిక లే-ఔట్లను వేసి అమ్మ కానికి పెట్టిన విషయాన్ని వివరిస్తూ ఆంధ్రజ్యోతి సోమవారం ‘అప్ప నంగా అమ్మేస్తున్నారు’ అనే శీర్షికన కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన గుంతకల్లు ఆర్డీవో రవీంద్ర సంబంధిత భూములను పరిర క్షించాలంటూ తహసీల్దారును ఆదేశించారు. ఈ మేరకు సోమవారం రాత్రి తహసీల్దారు రాము ఆ భూముల్లో హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు.  ఇది ప్రభుత్వ భూమి అని, ఈ భూమిని అన్యాక్రాంతం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేశా రు. కార్యక్రమంలో ఆర్‌ఐలు, వీఆర్‌ఓలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-06-28T06:23:38+05:30 IST