మష్రూమ్ సూప్తో ఒళ్లు వెచ్చగా...
ABN , First Publish Date - 2020-02-10T06:13:52+05:30 IST
ఈ సీజన్లో ఉదయం బ్రేక్ఫాస్ట్తో మొదలు లంచ్, రాత్రి డిన్నర్లో కూడా వేడివేడి ఆహారం తినేందుకే ప్రాధాన్యమిస్తాం.
ఈ సీజన్లో ఉదయం బ్రేక్ఫాస్ట్తో మొదలు లంచ్, రాత్రి డిన్నర్లో కూడా వేడివేడి ఆహారం తినేందుకే ప్రాధాన్యమిస్తాం.
అలానే ఈవినింగ్ స్నాక్గా మష్రూమ్ సూప్ తాగితే ఒళ్లంతా వెచ్చదనం నిండుతుంది అంటున్నారు చెఫ్ సంజీవ్ కపూర్.
కావాల్సినవి
బటన్ మష్రూమ్స్- కప్పు, ఆలివ్ ఆయిల్- టేబుల్ స్పూన్, బట్టర్ - టేబుల్స్పూన్, తరిగిన అల్లం- టేబుల్ స్పూన్, సన్నగా తరిగిన ఉల్లిపాయ, మైదాపిండి- ఒకటిన్నర టేబుల్స్పూన్, పాలు (నల్లమిరయాల పొడి కలిపినవి)- ఒకటిన్నర కప్పు, ముప్పావుకప్పు- ఫ్రెష్క్రీమ్. ఉప్పు తగినంత, వాము ఆకులు గార్నిష్ కోసం.
తయారీ
- నాన్స్టిక్ పాన్లో ఆలివ్ ఆయిల్, బట్టర్ను వేడిచేయాలి. తరిగిన అల్లం వేసి కలపాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేదాకా వేగించాలి.
- వాము ఆకులు, మైదా పిండి వేసి బాగా కలిపి నిమిషం పాటు వేగించాలి.
- బటన్ మష్రూమ్స్, ఉప్పు వేసి మిక్స్ చేసి 5 నుంచి 6 నిమిషాలు ఉడికించాలి. మరిన్ని మష్రూమ్స్ వేసి, తగినన్ని నీళ్లు పోసి, ఉప్పు వేసి కొద్దిసేపు మంటపై ఉంచాలి. తరువాత మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి.
- ఈ మిశ్రమాన్ని వేడిచేసి, పాలు పోసి 2నిమిషాలు మంటపై ఉంచాలి. ఇప్పుడు ఫ్రెష్క్రీమ్, మిరియాల పొడి చల్లాలి. వాము ఆకులతో గార్నిష్ చేస్తే వేడివేడి మష్రూమ్ సూప్ రెడీ.