ధాన్యాన్ని భద్రపరచుకునేందుకే గిడ్డంగులు
ABN , First Publish Date - 2022-09-29T05:48:24+05:30 IST
రైతులు వారు పడ్డించిన ధాన్యాన్ని భద్రపరచుకోవడా నికే గిడ్డంగులను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కడప రీజనల్ మేనేజర్ బాలుస్వామి పేర్కొన్నారు.
పీలేరు, సెప్టెంబరు 28: రైతులు వారు పడ్డించిన ధాన్యాన్ని భద్రపరచుకోవడా నికే గిడ్డంగులను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర గిడ్డంగుల సంస్థ కడప రీజనల్ మేనేజర్ బాలుస్వామి పేర్కొన్నారు. పీలేరు ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ఉన్న గిడ్డంగులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ దాదాపు 2100 మెట్రిక్ టన్నుల సరుకులను నిల్వ చేసుకునే విధంగా పీలేరులోని గిడ్డంగులను నిర్మిం చామన్నారు. ప్రస్తుతం వాటిలో 186 టన్నుల కందులు నిల్వ ఉన్నాయమన్నారు. రైతు లు వారు పండించిన పంటలను వాటిలో నిల్వ చేసుకుని గిట్టుబాటు ధర లభిం చిన ప్పుడు విక్రయించుకోవచ్చన్నారు. అనంతరం ఆయన గిడ్డంగుల్లో నిల్వ ఉన్న కందుల ను, గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలోని షాపింగ్ కాంప్లెక్స్ గదులను ఆయన పరిశీలిం చారు. అందులోని పైఅంతస్థులో ఖాళీగా ఉన్న మూడు గదులకు బుధవారం వేలం నిర్వహించగా ఎవరూ ముందుకు రాకపోవడంతో వేలాన్ని రద్దు చేశారు. ఉన్నతాధికా రులతో మాట్లాడి త్వరలోనే మరోమారు వేలం ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మేనేజర్ వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు.