100 రూపాయల కోసం బాలుడి ప్రాణం తీసిన వార్డుబాయ్

ABN , First Publish Date - 2021-11-01T01:05:15+05:30 IST

నగరంలోని నిలోఫర్ ఆస్పత్రిలో దారుణం

100 రూపాయల కోసం బాలుడి ప్రాణం తీసిన వార్డుబాయ్

హైదరాబాద్: నగరంలోని నిలోఫర్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. 100 రూపాయల కోసం బాలుడి ప్రాణాన్ని వార్డుబాయ్ తీసాడు. మూడ్రోజుల క్రితం బాలుడిని తండ్రి ఆస్పత్రిలో అడ్మిట్‌ చేసాడు. బాలుడికి ఊపిరితిత్తుల సమస్య ఉండడంతో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఆక్సిజన్ సిలిండర్‌ను  పెట్టడానికి 100 రూపాయల లంచం ఇవ్వాలని వార్డుబాయ్ డిమాండ్ చేసాడు. అయితే వారు లంచం ఇవ్వకపోవడంతో ఆక్సిజన్ సిలిండర్‌ను వేరేవారికి వార్డుబాయ్ అమర్చాడు. దీంతో ఊపిరి ఆడక బాలుడు మృతి చెందాడు. ఆస్పత్రి సిబ్బంది తీరుపై ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రి ఆగ్రహం వ్యక్తం చేసారు. వార్డుబాయ్‌ను ఆస్పత్రి సూపరింటెండెంట్ సస్పెండ్ చేసారు. 

Updated Date - 2021-11-01T01:05:15+05:30 IST