‘విజయసాయి అలా వెళ్లారో లేదో వెంటనే తొలగించేశారు‘

ABN , First Publish Date - 2021-03-02T23:33:16+05:30 IST

‘విజయసాయి అలా వెళ్లారో లేదో వెంటనే తొలగించేశారు‘

‘విజయసాయి అలా వెళ్లారో లేదో వెంటనే తొలగించేశారు‘

విశాఖ: 94వ వార్డు టీడీపీ అభ్యర్థికి చెందిన ప్రచార స్టిక్కర్లు తొలగించడంతో వివాదం రేగింది. వేపగుంట సమీపంలో విజయసాయిరెడ్డి ప్రచారం చేసి వెళ్లిన తర్వాత జీవీఎంసీ అధికారులమంటూ కొందరు వచ్చి టీడీపీ అభ్యర్థి బంధువుల ఇళ్లకు అంటించుకున్న పోస్టర్లు తొలగించారని స్థానికులు మండిపడ్డారు. తొలగించిన పోస్టర్లు తమకు ఇవ్వాలని కోరినా పట్టించుకోకుండా వాటిని కాలితో తొక్కి కాల్వలో పడేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఇంటికి అంటించుకున్న పోస్టర్లు తొలగించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. 


Updated Date - 2021-03-02T23:33:16+05:30 IST