ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో వార్డుబాయ్ దారుణం

ABN , First Publish Date - 2020-11-10T12:04:41+05:30 IST

దేశ రాజధాని నగరంలోని ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది....

ఢిల్లీ ప్రభుత్వ ఆసుపత్రిలో వార్డుబాయ్ దారుణం

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలోని ఢిల్లీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం జరిగింది. ఆసుపత్రిలో మూడేళ్ల బాలికపై వార్డు బాయ్ అఘాయిత్యం చేయడం కలకలం రేపింది.అనారోగ్యానికి గురైన మూడేళ్ల బాలిక చికిత్స పొందేందుకు తన తల్లితో కలిసి ఆసుపత్రిలో చేరింది. రాత్రిపూట మూడేళ్ల బాలికపై వార్డుబాయ్ అత్యాచారం చేస్తుండగా అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అత్యాచార ఘటనతో బాలిక పరిస్థితి విషమంగా మారడంతో వైద్యులు అదే ఆసుపత్రిలో చికిత్స చేస్తున్నారు. ఆసుపత్రి వార్డుబాయ్ పై పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేశామని ఢిల్లీ పోలీసులు చెప్పారు. 

Updated Date - 2020-11-10T12:04:41+05:30 IST