Warangal: తీవ్ర జ్వరంతో బాలిక మృతి...బంధువుల ఆందోళన

ABN , First Publish Date - 2021-12-07T13:30:29+05:30 IST

జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 7వ తరగతి విద్యార్థిని మృతి తీవ్ర కలకలం రేపుతోంది.

Warangal: తీవ్ర జ్వరంతో బాలిక మృతి...బంధువుల ఆందోళన

వరంగల్: జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 7వ తరగతి విద్యార్థిని మృతి తీవ్ర కలకలం రేపుతోంది. తీవ్ర జ్వరంతో నందిని అనే విద్యార్థిని మృతి చెందింది. అయితే గత 10 రోజుల నుంచి జ్వరంతో ఇబ్బందులు పడుతున్నా పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం వహించడం వల్లే విద్యార్థిని మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహంతో పాఠశాల ఎదుట  బంధువులు ఆందోళన చేపట్టారు. 

Updated Date - 2021-12-07T13:30:29+05:30 IST