కాళోజీ హెల్త్ యూనివర్సటీలో పీజీ సీట్ల బ్లాక్ దందా
ABN , First Publish Date - 2022-04-19T16:52:52+05:30 IST
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో పీజీ సీట్ల బ్లాక్ దందా కలకలం రేపుతోంది.
వరంగల్: కాళోజీ హెల్త్ యూనివర్సిటీ పరిధిలో పీజీ సీట్ల బ్లాక్ దందా కలకలం రేపుతోంది. ప్రైవేటు యాజమాన్యాలు... యాజమాన్య కోటాలో సీట్లను బ్లాక్ చేసి కోట్లకు అమ్ముకుంటున్నారు. కౌన్సిలింగ్లో 45 అనుమానాస్పద ధరఖాస్తులు గుర్తించిన రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్ ఈ విషయాన్ని మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేయాలని హరీష్ రావు సూచించారు. దీంతో పీజీ సీట్ల బ్లాక్ దందాపై వరంగల్ సీపీ తరుణ్ జోషీకి రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశారు.