కాజీపేట రైల్వేస్టేషన్లో బాంబు కలకలం
ABN , First Publish Date - 2022-04-13T18:03:07+05:30 IST
జిల్లాలోని కాజీపేట రైల్వే స్టేషన్ లో బాంబు కలకలం రేపింది.
వరంగల్: జిల్లాలోని కాజీపేట రైల్వే స్టేషన్లో బాంబు కలకలం రేపింది. ముంబయి వెళ్లే లోక్మాన్య తిలక్ ఎక్స్ప్రెస్ రైలులో బాంబు పెట్టామని 100కు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు బాంబు స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించారు. రైలు బోగీల్లో అడుగడుగునా సోదాలు చేపట్టారు.