Warangal: పోలీసులను వణికిస్తున్న కరోనా
ABN , First Publish Date - 2022-01-15T13:53:07+05:30 IST
కరోనా మహమ్మారి పోలీసులను వణికిస్తోంది. జాతర్లలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు.
వరంగల్: కరోనా మహమ్మారి పోలీసులను వణికిస్తోంది. జాతర్లలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది కరోనా బారిన పడుతున్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్లో ఓ సీఐ, ఇద్దరు ఎస్ఐలు, 12 మంది కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అటు ఐనవోలు మల్లిఖార్జునస్వామి బ్రహ్మోత్సవాలలో విధులు నిర్వహిస్తున్న 8 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. పోలీసులు కరోనా బారిన పడుతుండటంతో జాతరల్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కుటుంబాల్లో భయం భయం నెలకొంది. బూస్టర్ డోస్ తీసుకొని మరీ పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు.