Warangal: ఏపీ ఎక్స్ప్రెస్ రైలులో పొగలు
ABN , First Publish Date - 2022-01-21T13:59:08+05:30 IST
విశాఖ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఏపీ ఎక్స్ప్రెస్ మంటలు చెలరేగాయి. ఎస్ 6 బోగీలో ఒక్కసారిగా పొగలు రావడంతో నెక్కొండ స్టేషన్లో
వరంగల్: విశాఖ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఏపీ ఎక్స్ప్రెస్ మంటలు చెలరేగాయి. ఎస్ 6 బోగీలో ఒక్కసారిగా పొగలు రావడంతో నెక్కొండ స్టేషన్లో డ్రైవర్ అప్రమత్తమై రైలును నిలిపివేశారు. ఏపీ ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఉన్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రయాణికులు రైల్లో నుంచి పరుగులు తీశారు. రైల్వేస్టేషన్లో ఉన్న ప్రయాణికులు కూడా భయంతో పరుగులు పెట్టారు. రైలు బ్రేకులు జాం కావడంతో పొగలు వచ్చాయని అధికారులు తెలిపారు. గంట నుంచి నెక్కొండ స్టేషన్లోనే ఏపీ ఎక్స్ప్రెస్ రైలును నిలిపివేశారు.