Warangal: టీఆర్ఎస్ కార్పొరేటర్ తేజస్విని భర్త శిరీష్ అరెస్ట్
ABN , First Publish Date - 2021-10-01T17:24:44+05:30 IST
అత్యాచారం కేసులో టీఆర్ఎస్ కార్పొరేటర్ తేజస్విని భర్త శిరీష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తనను శిరీష్ ప్రేమిస్తున్నానంటూ తన వెంట పడి వివాహం చేసుకుంటానని
వరంగల్: అత్యాచారం కేసులో టీఆర్ఎస్ కార్పొరేటర్ తేజస్విని భర్త శిరీష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తనను శిరీష్ ప్రేమిస్తున్నానంటూ తన వెంట పడి వివాహం చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడని అండర్ రైల్వేగేట్ ప్రాంతానికి చెందిన ఓ యువతి గత నెల 23న తన ఫిర్యాదులో పేర్కొంది. రంగంలోకి దిగిన పోలీసులు కార్పొరేటర్పై అత్యాచారం, నమ్మకద్రోం, బెదిరింపులు కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న శిరీష్ను పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఇప్పటికే శిరీష్ తండ్రి, లిక్కర్ డాన్ ఆకుతోట సుధాకర్ పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. శిరీష్ను పరకాల సబ్ జైలుకు పోలీసులు తరలించారు.