Warangal: టీఆర్ఎస్ కార్పొరేటర్ తేజస్విని భర్త శిరీష్ అరెస్ట్

ABN , First Publish Date - 2021-10-01T17:24:44+05:30 IST

అత్యాచారం కేసులో టీఆర్ఎస్ కార్పొరేటర్ తేజస్విని భర్త శిరీష్‎ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తనను శిరీష్‌ ప్రేమిస్తున్నానంటూ తన వెంట పడి వివాహం చేసుకుంటానని

Warangal: టీఆర్ఎస్ కార్పొరేటర్ తేజస్విని భర్త శిరీష్ అరెస్ట్

వరంగల్: అత్యాచారం కేసులో టీఆర్ఎస్ కార్పొరేటర్ తేజస్విని భర్త శిరీష్‎ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తనను శిరీష్‌ ప్రేమిస్తున్నానంటూ తన వెంట పడి వివాహం చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకున్నాడని అండర్‌ రైల్వేగేట్‌ ప్రాంతానికి చెందిన ఓ యువతి గత నెల 23న తన ఫిర్యాదులో పేర్కొంది. రంగంలోకి దిగిన పోలీసులు కార్పొరేటర్‎పై  అత్యాచారం, నమ్మకద్రోం, బెదిరింపులు కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న శిరీష్‎ను పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఇప్పటికే శిరీష్ తండ్రి, లిక్కర్ డాన్ ఆకుతోట సుధాకర్  పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. శిరీష్‎ను పరకాల సబ్ జైలుకు పోలీసులు తరలించారు.

Updated Date - 2021-10-01T17:24:44+05:30 IST