వరంగల్ ఎంజీఎంలో బీజేపీ నేతల ఆందోళన
ABN , First Publish Date - 2021-01-16T18:10:11+05:30 IST
జిల్లాలోని ఎంజీఎం ఆస్పత్రిలో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు.
వరంగల్: జిల్లాలోని ఎంజీఎం ఆస్పత్రిలో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ప్లెక్సీపై ప్రధాని ఫోటో లేకపోవడంపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను బీజేపీ నాయకులు చించివేశారు. బీజేపీ నేతల ఆందోళనతో ఆస్పత్రి వద్ద కొద్దిసేపు గందరగోళం నెలకొంది.