వరంగల్ జీపు ప్రమాద ఘటన.. మరో ఇద్దరి కోసం గాలింపు

ABN , First Publish Date - 2020-10-28T12:09:20+05:30 IST

జిల్లాలో జరిగిన జీపు ప్రమాద ఘటనలో మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నా

వరంగల్ జీపు ప్రమాద ఘటన.. మరో ఇద్దరి కోసం గాలింపు

వరంగల్: జిల్లాలో జరిగిన జీపు ప్రమాద ఘటనలో మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. రాత్రంతా పోలీసులు బావిలో నుంచి నీటిని తోడిస్తున్నారు. పక్కనే చెరువు ఉండటంతో నీటి ఊటతో ఇబ్బంది తలెత్తుతోంది. జిల్లాలోని సంగెం మండలం గవిచర్ల దగ్గర నిన్న ఓ జీపు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 11 మంది సురక్షితంగా బయటపడ్డారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని అతికష్టం మీద జీపును బయటకు తీశారు. డ్రైవర్ సతీష్ మృతదేహం లభ్యమవగా మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. 

Updated Date - 2020-10-28T12:09:20+05:30 IST