చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం: నారాయణస్వామి

ABN , First Publish Date - 2020-06-06T10:16:24+05:30 IST

ముఖ్యమంత్రి జగన్‌ అన్నట్లు.. మనం చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం చేస్తున్నాం. అక్రమ మద్యం తయారీ, రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎ్‌సఈబీ) అద్భుతంగా పనిచేస్తోంది.

చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం: నారాయణస్వామి

వెదురుకుప్పం, జూన్‌ 5: ‘ముఖ్యమంత్రి జగన్‌ అన్నట్లు.. మనం చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం చేస్తున్నాం. అక్రమ మద్యం తయారీ, రవాణాను అరికట్టేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎ్‌సఈబీ) అద్భుతంగా పనిచేస్తోంది.  అలాంటి ఎస్‌ఈబీ ఏర్పాటుకు సంబంధించిన జీవో 14(1/2) రద్దు చేయాలని హైకోర్టులో పిల్‌ వేయడం బాధాకరం’ అని శుక్రవారం ట్విటర్‌లో పేర్కొన్నారు. ‘ఎస్‌ఈబీ ఏర్పాటు ఉత్తర్వులపై ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఇప్పటి వరకు హైకోర్టును ఆశ్రయించలేదు. కానీ సంబంధం లేని వ్యక్తి పిల్‌ దాఖలు చేయాల్సిన అవసరం ఏముంది? పిటిషనర్‌ ప్రభుత్వ ఉద్యోగి కాదు. ప్రభుత్వ ఉద్యోగులకు లేని ఇబ్బంది ఈ పిటిషనర్‌కు ఎందుకు?’ అని నారాయణస్వామి ట్వీట్‌ చేశారు.

Updated Date - 2020-06-06T10:16:24+05:30 IST