కుప్పంలో యుద్ధ వాతావరణం

ABN , First Publish Date - 2021-11-15T21:45:14+05:30 IST

జిల్లాలోని కుప్పం పట్టణంలో యుద్ధ వాతావరణం నెలకొంది. టీడీపీ

కుప్పంలో యుద్ధ వాతావరణం

చిత్తూరు: జిల్లాలోని కుప్పం పట్టణంలో  యుద్ధ వాతావరణం నెలకొంది. టీడీపీ మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాసులును పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఎందుకు అరెస్ట్‌ చేశారంటూ నిలదీసిన టీడీపీ శ్రేణులపై పోలీసులు లాఠీచార్జ్‌ చేశారు. టీడీపీ శ్రేణులు, నాయకులను వెంటాడి వేటాడి లాఠీఛార్జి చేశారు. లాఠీచార్జ్‌లో టీడీపీ శ్రేణులకు తీవ్రగాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. శ్రీనివాసులును బలవంతంగా పోలీస్ వాహనంలో ఎక్కించుకుని రహస్య ప్రాంతాలకు తరలించారు. ఎక్కడికక్కడ పోలీసులు ఎదురుదాడికి దిగి టీడీపీ శ్రేణులను అరెస్టు చేస్తున్నారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి ఉద్రిక్తతంగా ఉంది. 



Updated Date - 2021-11-15T21:45:14+05:30 IST