‘పరిహారం అందే వరకు గ్రామాలు ఖాళీ చేయం’

ABN , First Publish Date - 2021-03-05T05:24:11+05:30 IST

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారాలు అందించేంత వరకు గ్రామాలను ఖాళీ చేసేది లేదని ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల సాధన సమితి అధ్యక్షుడు మిడియం వెంకటస్వామి అన్నారు.

‘పరిహారం అందే వరకు గ్రామాలు ఖాళీ చేయం’

పోలవరం, మార్చి 4: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారాలు అందించేంత వరకు గ్రామాలను ఖాళీ చేసేది లేదని ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల సాధన సమితి అధ్యక్షుడు మిడియం వెంకటస్వామి అన్నారు. కొండ్రూకోటలో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించకుం డా రెవెన్యూ అధికారులు మొక్కుబడిగా గ్రామ సభలు నిర్వహించారన్నారు.  18 ఏళ్లు నిండిన యువతి, యువకులకు గ్రామాలు ఖాళీ చేసే నాటికి ప్యాకేజీ ఇవ్వాలని, పెళ్లైన యువతలకు కూడా ప్యాకేజీలు చెల్లించాలని భూముల సమస్యలు పరిష్కరించాలని రూ.10లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. నిర్వాసితుల అభీష్టం మేరకు సమస్యలు పరిష్కరించి తరలించాలని డిమాండ్‌ చేశారు. ఉన్నతాధికారులకు సమస్యలను తెలియజేస్తూ లేఖలు పంపించామన్నారు. మాడే రాజు, కట్‌రాజుల సతీశ్‌, నర్సారపు రాజేశ్‌, గనిశెట్టి సతీశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-05T05:24:11+05:30 IST