ఉద్యోగ భద్రత కల్పించాలని వినతి
ABN , First Publish Date - 2020-06-02T10:15:29+05:30 IST
ఉద్యోగ భద్రత కల్పించాలని మద్యం షాపుల నుంచి తొలగించిన సూపర్వైజర్లు, సేల్స్మెన్లు
విజయనగరం (ఆంధ్రజ్యోతి) : ఉద్యోగ భద్రత కల్పించాలని మద్యం షాపుల నుంచి తొలగించిన సూపర్వైజర్లు, సేల్స్మెన్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం వారు కలెక్టరేట్కు వచ్చారు. అయితే ఆయన కలెక్టర్ లేకపోవడంతో జేసీ కిశోర్కుమార్కు వినతిపత్రం ఇచ్చారు. ఉద్యోగం నుంచి తొలగించినా ఇతర శాఖల్లో కాంట్రాక్ట్ పద్ధతిపై పని కల్పిస్తామని అధికారులు చెప్పిన మాటలు అమలు చేయాలని కోరారు. ఏడాది పాటు ఉద్యోగం చేసేందుకు అంగీకార పత్రం తీసుకోగా, ఇప్పుడు 6 నెలల్లోనే 80 మందిని తొలగించడం దారుణమన్నారు. భవిష్యత్లో మరిన్ని షాపులు మూసేస్తామని సర్కార్ చెబుతున్న నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.