‘పల్లెప్రగతి’లో భాగస్వాములు కావాలి
ABN , First Publish Date - 2022-05-25T05:43:33+05:30 IST
‘పల్లెప్రగతి’లో భాగస్వాములు కావాలి
ఇబ్రహీంపట్నం, మే 24: పల్లెప్రగతి కార్యక్రమంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేష్ కోరారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో పల్లెప్రగతి 5వ విడతపై ప్రజాప్రతినిధులు, అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 3 నుంచి 18 వరకు గ్రామస్థాయి అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసి ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. నాలుగు విడతల్లో జరిగిన పల్లెప్రగతి అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించుకోవాలని అన్నారు. ఎంపీడీవో క్రాంతి కిరణ్, తహసీల్దార్ అనిత, ఏఈ ఇంద్రసేనారెడ్డి, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు బూడిద రాంరెడ్డి, ఎంపీటీసీల సంఘం మండల అధ్యక్షుడు ఏనుగు భరత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.