ఎన్‌ఎండీసీతో వాల్తేరు డివిజన్‌ రైలు బ్రాండింగ్‌

ABN , First Publish Date - 2021-10-20T06:59:46+05:30 IST

వాల్తేరు డివిజన్‌ చేపడుతున్న వినూత్న విధానాలలో భాగంగా నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎండీసీ)తో రైలు బ్రాండింగ్‌కు శ్రీకారం చుట్టింది

ఎన్‌ఎండీసీతో వాల్తేరు డివిజన్‌ రైలు బ్రాండింగ్‌
జెండా ఊపి బ్రాండింగ్‌ ర్యాక్‌లను ప్రారంభిస్తున్న ఎన్‌ఎండీసీ సీఎండీ సుమిత్‌ దేబ్‌, డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ సెత్పతీ, ఏడీఆర్‌ఎం సుధీర్‌కుమార్‌ గుప్తా

విశాఖపట్నం, అక్టోబరు 19: వాల్తేరు డివిజన్‌ చేపడుతున్న వినూత్న విధానాలలో భాగంగా  నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఎన్‌ఎండీసీ)తో రైలు బ్రాండింగ్‌కు శ్రీకారం చుట్టింది. దీనికి సంబంధించి ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన ర్యాక్‌ వినైల్‌ రాంపింగ్‌ ద్వారా సోమవారం రాత్రి ఎన్‌ఎండీసీ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుమిత్‌ దేబ్‌, డీఆర్‌ఎం అనూప్‌కుమార్‌ సెత్పతీ, ఏడీఆర్‌ఎం సుధీర్‌కుమార్‌ గుప్తాలు  పచ్చ జెండా ఊపి విశాఖ రైల్వే స్టేషన్‌ నుంచి ప్రారంభించారు. ఒక సంస్థకు చెందిన బ్రాండ్‌ను ప్రమోట్‌ చేసే విధానంలో భాగంగా రైలు బ్రాండింగ్‌ ద్వారా ప్రకటనను ప్రదర్శన చేస్తే లక్షలాది మంది వినియోగదారులకు సులభంగా, వేగవంతంగా చేరుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇనుప ఖనిజం ఉత్పత్తిదారులైన ఎన్‌ఎండీసీ బ్రాండ్‌ ప్రమోషన్‌ను ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన రెండు ర్యాక్‌లను(కోచ్‌ల బయట భాగంలో ప్రకటన ముద్రణతో) వినియోగిస్తున్నామన్నారు. 



Updated Date - 2021-10-20T06:59:46+05:30 IST